పవన్ను ఓడించేందుకు వైసీపీ కుటిల యత్నాలు...!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించేందుకు నాలుగైదు లారీల మద్యందించారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మ ఆరోపించారు.....
దిశ,కాకినాడ జిల్లా ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించేందుకు నాలుగైదు లారీల మద్యందించారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మ ఆరోపించారు. పట్టణంలో భారీగా మద్యం పట్టుబడటంపై ఆయన స్పందించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి పిఠాపురంలో గెలవాలని వైసీపీ చూస్తోందన్నారు. పవన్ను ఓడించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని, అధికార పార్టీ నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో శుక్రవారం రాత్రి ఎస్ఈబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్ఆర్ గార్డెన్, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.