తూర్పుగోదావరిలో విషాదం.. ప్రాణాలు బలి తీసుకున్న కల్తీ కల్లు

Update: 2022-02-02 09:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు ఐదుగురిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది. లోదొడ్డి గ్రామానికి చెందిన గిరిజనులు కల్తీ జీలుగ కల్లు తాగి మృతి చెందారు. సమాచారం అందుకున్న రాజవొమ్మంగి పోలీసులు స్థానిక అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యాధికారులు గిరిజనులు సేవించిన కల్తీ జీలుగ కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో లోదొడ్డి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News