శ్రీవారి సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు..

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్యం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Update: 2024-04-17 08:53 GMT

దిశ, తిరుమల: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్యం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు టిటిడి అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మలేషియా, సింగపూర్, ఒలంపిక్స్ టోర్నమెంట్‌లో ఆడేందుకు నాకు స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని సింధు తెలిపారు.

Similar News