చంద్రబాబు కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచారు: మంత్రి రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి లోకేష్‌లపై విమర్శలు గుప్పించింది.

Update: 2023-01-22 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి లోకేష్‌లపై విమర్శలు గుప్పించింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచారని రోజా ఆరోపించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక దొంగ ఓట్లు తీసేయడంతో పరిస్థితి మారిపోయిందన్నారు. ఇక చంద్రబాబు కొడుకు లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్ర టీడీపీకి మంగళం పాడే యాత్ర అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ వార్డ్ మెంబర్‌కు కూడా ఎక్కువేనని అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు భద్రత ఇవ్వాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు హాయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆయన లెక్కలతో వస్తే చర్చకు సిద్ధమని రోజా ఛాలెంజ్ చేశారు. 

Tags:    

Similar News