Ap News: ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు?

పీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలకు వెళ్లొచ్చని ఆయన జోస్యం చెప్పారు....

Update: 2022-12-09 16:02 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలకు వెళ్లొచ్చని ఆయన జోస్యం చెప్పారు. అంతకంటే ముందు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాడని సత్యకుమార్ ఆరోపించారు. రాజకీయాల్లో భాగంగానే ఏపీ, తెలంగాణ మళ్లీ కలవాలనే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని.. అందువల్లే ముందస్తుకు వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నాడని సత్యకుమార్ పేర్కొన్నారు. 

Similar News