టీడీపీలో చిచ్చు రేపిన తొలి జాబితా.. పెనుగొండలో తీవ్ర వ్యతిరేకత

టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి....

Update: 2024-02-24 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సీట్లు రాని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ టీడీపీ అభ్యర్థిగా సవితను చంద్రబాబు ఖరారు చేశారు. తొలి జాబితాలో ఆమె పేరు ప్రకటించారు. దీంతో పెనుగొండలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. మాజీ ఎమ్మెల్యే బీసీ పార్థసారిథికి టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా చేశారు. టీడీపీ తొలి జాబితా కాపీలను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సవితకు తాము సహకరించమని బీకే పార్థసారిథి వర్గీయులు తేల్చి చెప్పారు.  పార్టీ కోసం తీవ్రంగా కృషి చేశామని.. ఇప్పుడు టికెట్ ఎవరికో ఇస్తే ఎలా అంటూ  ప్రశ్నించారు. బీకే పార్థసారథికి న్యాయం చేయకపోతే పార్టీ వీడేందుకు  సిద్ధమని హెచ్చరించారు.

Read More.. 

టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేతల రాజీనామా  

Tags:    

Similar News