ఐపీఎల్ బెట్టింగ్.. యువకుడు సూసైడ్ !

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించి అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు సోనుకుమార్ అనే 19ఏళ్ల యువకుడు నగరానికి వలసవచ్చి పంజాగుట్టలో ఫ్రెండ్స్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సోనుకుమార్.. డబ్బులు మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. చేతిలో డబ్బులు లేక తీవ్ర ఒత్తిడికి గురై మంగళవారం ఉదయం 8.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలోనే గదిలోకి వచ్చిన ఫ్రెండ్స్.. పోలీసులకు […]

Update: 2020-11-03 11:06 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించి అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు సోనుకుమార్ అనే 19ఏళ్ల యువకుడు నగరానికి వలసవచ్చి పంజాగుట్టలో ఫ్రెండ్స్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సోనుకుమార్.. డబ్బులు మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. చేతిలో డబ్బులు లేక తీవ్ర ఒత్తిడికి గురై మంగళవారం ఉదయం 8.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలోనే గదిలోకి వచ్చిన ఫ్రెండ్స్.. పోలీసులకు సమాచారం అందించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సోనుకుమార్ సోదరుడు అర్జున్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News