పండుగపూట విషాదం.. జాతరకు వెళ్లొస్తూ బస్సు కిందపడ్డ వ్యక్తి

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం రేగొండ సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర స్వామి జాతరకు బైకుపై వెళ్లి వస్తుండగా నరేష్(35) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొట్టిన అనంతరం బస్సు మీదనుంచి వెళ్లడంతో తలతోపాటు బాడీ మొత్తం నుజ్జు నుజ్జైంది. శాయంపేట మండలంలోని మాదారిపేట గ్రామానికి చెందిన నరేష్‌ మరణించడంతో గ్రామంలో పండుగపూట విషాదం నెలకొంది. మృతుడికి ఏడాది క్రితం […]

Update: 2021-11-19 11:33 GMT

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం రేగొండ సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర స్వామి జాతరకు బైకుపై వెళ్లి వస్తుండగా నరేష్(35) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొట్టిన అనంతరం బస్సు మీదనుంచి వెళ్లడంతో తలతోపాటు బాడీ మొత్తం నుజ్జు నుజ్జైంది. శాయంపేట మండలంలోని మాదారిపేట గ్రామానికి చెందిన నరేష్‌ మరణించడంతో గ్రామంలో పండుగపూట విషాదం నెలకొంది. మృతుడికి ఏడాది క్రితం వివాహం జరిగినట్లు సమాచారం.

Tags:    

Similar News