పట్టపగలే భారీ చోరీ.. 40 తులాల బంగారంతో పరారీ

దిశ, ఎల్బీ నగర్: వనస్థలిపురంలో భారీ చోరి జరిగింది. హుడసాయి నగర్ లో నివాసం ఉంటున్న సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. సాయి ప్రతాప్ కుటుంబం మధ్యాహ్నం సమయంలో షాపింగ్ కు వెళ్లింది. తిరిగి వారు రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో 40 తులాల బంగారం, 5కేజీల వెండి, 35వేల […]

Update: 2021-12-19 09:49 GMT

దిశ, ఎల్బీ నగర్: వనస్థలిపురంలో భారీ చోరి జరిగింది. హుడసాయి నగర్ లో నివాసం ఉంటున్న సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. సాయి ప్రతాప్ కుటుంబం మధ్యాహ్నం సమయంలో షాపింగ్ కు వెళ్లింది.

తిరిగి వారు రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో 40 తులాల బంగారం, 5కేజీల వెండి, 35వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న దొంగలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News