ఢిల్లీని కాపాడిన కుల్దీప్ యాదవ్.. పోరాడే స్కోరు నమోదు

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు కలకత్తా, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Update: 2024-04-29 15:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు కలకత్తా, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్లు వెంట వెంటనే కుప్పకూలడం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా వచ్చిన వారు వచ్చినట్లే అవుట్ అయ్యారు. కెప్టెన్ పంత్ 27, పోరెల్ 18 అక్షర్ 15, మినహా ఎవరూ సరిగ్గా రాణించలేదు. దీంతో ఢిల్లీ జట్టు 15 ఓవర్లకే 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్ ఒంటరి పోరు చేశాడు. మొత్తం 26 బంతులను ఫేస్ చేసిన కుల్దీప్ 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులతో నాటైట్ గా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచులో కలకత్తా బౌలర్లు.. వరుణ్ చక్రవర్తి 3, వైబర్ అరోరా 2, హర్షిత్ రాణా 2, స్టార్క్, సునీల్ నరైన ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో కలకత్తా గెలవాలంటే 120 బంతుల్లో 154 పరుగులు చేయాల్సి ఉంది.

Similar News