విమానం కూలి… 22 మంది విద్యార్థులు మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలి, 22 మంది శిక్షణ పొందుతున్న విద్యార్థులు మృతిచెందారు. మొత్తం విమానంలో 28 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, మంటల ధాటికి విమానంలో ఉన్న 22 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Update: 2020-09-26 00:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలి, 22 మంది శిక్షణ పొందుతున్న విద్యార్థులు మృతిచెందారు. మొత్తం విమానంలో 28 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, మంటల ధాటికి విమానంలో ఉన్న 22 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News