ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 45 మందికి గాయాలు

దిశ, వెబ్‌డెస్క్ : బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జు అయిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన క్రొయేషియా దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్, సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కీ వద్ద రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 […]

Update: 2021-07-25 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జు అయిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన క్రొయేషియా దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్, సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కీ వద్ద రహదారిపై బస్సు బోల్తా పడింది.

ఈ క్రమంలో బస్సులో నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్​కోవిక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు.

Tags:    

Similar News