- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: ఈ రోజు(మంగళవారం) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ రాజధాని ట్రైన్లలో ప్రయాణించేవారు తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. సోమవారం రాత్రి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. రైలు ప్రయాణానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన సూచనల్లో ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించలేదు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచనలు మాత్రమే చేసింది. కానీ, సోమవారం అర్ధరాత్రి రైల్వే శాఖ.. ఓ ట్వీట్తో ఈ యాప్ను ప్రయాణికులకు తప్పనిసరి చేసింది. దీంతో రైల్వే అధికారుల్లోనే ఈ నిర్ణయంపై గందరగోళం నెలకొంది. ఈ ట్వీట్ గురించి ఇంకా తమకు సమాచారం అందలేదని రైల్వేస్ జోనల్ స్థాయిలోని పలువురు అధికారులు తెలిపారు. ప్రయాణికుల పరిస్థితి ఇలాగే ఉన్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రైల్వే స్టేషన్కు 90 నిమిషాలు ముందుగా వచ్చిన ప్రయాణికులను.. అక్కడే.. అప్పుడే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.