సన్ రైజర్స్ పై సంచలన రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ

by Disha Web Desk 12 |
సన్ రైజర్స్ పై సంచలన రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో అనేక రికార్డులు బద్దలయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ఆకాశమే హద్దుగా చెలరేగి.. 20 ఓవర్లకు 287 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేశారు. అనంతరం చేసింగ్ కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు.. హైదరాబాద్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చూపరు. ఒకానొక సమయంలో ఆర్సీబీ భారీ టార్గెట్ ను చేజ్ చేసేల కనిపించింది. కానీ చివరకు డీకే అవుట్ కావడంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికి ఆర్సీబీ జట్టు ఓ సంచలన రికార్డును నెలకొల్పింది. లక్ష్య ఛేదనలో 250 కంటే ఎక్కువ స్కోర్ చేసిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇదే క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సమర్పించిన జట్టుగా చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది.


Next Story