ఐపీఎల్ 2024: హెడ్ విధ్వంసం 20 బంతుల్లో అర్ధ సెంచరీ

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: హెడ్ విధ్వంసం 20 బంతుల్లో అర్ధ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు బెంగళూరు వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. గత కొన్ని మ్యాచులుగా మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ మరోసారి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. స్టార్ బ్యాటర్ అయిన హెడ్ కేవలం 20 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో మొదటి పవర్ ప్లేలో హైదరాబాద్ జట్టు మరో హైఎస్ట్ స్కోరును నమోదు చేసుకుంది. ఈ స్కోర్ ఇలానే కొనసాగితే చినస్వామి స్టేడియంలో ఈ రోజు మరో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది.

Next Story

Most Viewed