రోహిత్ పుట్టినరోజు వేళ ముంబై జట్టుకు షాక్..

by Disha Web Desk 12 |
రోహిత్ పుట్టినరోజు వేళ ముంబై జట్టుకు షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ముంబై, లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్ నడుస్తుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కాగా మ్యాచ్ ప్రారంభంలోనే ఓపెనర్లు రోహిత్ 4 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే 10 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ రనౌట్ కాగా, కెప్టెన్ హర్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు పవర్ ప్లే లోని ఆరు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 28 పరుగులు మాత్రమే చేసింది. ఈ రోజు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే కావడంతో అతను ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోతాడని ఫ్యాన్స్ వేచి చూశారు కానీ.. పుట్టినరోజు వేళ రోహిత్ కు షాక్ తగిలింది. తన బర్తడే రోజు ముంబై జట్టు ఈ సీజన్ లో పవర్ ప్లే అత్యల్ప స్కోరును నమోదు చేసుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో కిషన్, వాదేరా ఉండగా.. ముంబై జట్టు ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాలి మరి.

Next Story

Most Viewed