భార్యపై భర్త కత్తితో దాడి..

by Disha Web Desk 23 |
భార్యపై భర్త కత్తితో దాడి..
X

దిశ, జవహర్ నగర్: భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చెందిన మేడ పెద్దబ్బాయి, తన భార్య మేడ ఇందిరా దంపతులు 6 ఏండ్ల క్రితం బతుకుతెరువు కోసం జవహర్ నగర్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటూ నాటు కోళ్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. తనకు తెలియకుండా రూ.4 లక్షలు అప్పు చేసిందని భార్యతో వాగ్వాదానికి దిగి కత్తితో దాడి చేశాడు. చేతులకు ,తల మీద,చాతి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ కి సమాచారం అందడంతో, ఆమెకు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


Next Story