లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య..సూసైడ్ నోట్ లో ఏం రాసిందంటే?

by Disha Web Desk 18 |
లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య..సూసైడ్ నోట్ లో ఏం రాసిందంటే?
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూప శ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళాశాల ఫ్యాకల్టీ అసభ్యకరంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడమే ఇందుకు కారణమని తెలిసింది.రూప శ్రీ ఆ మేరకు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే..అసలు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.

నాన్నా..మరి ఫ్యాకల్టీ కి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరే అని అంటే ఇంకేం చెప్పగలము నాన్నా..చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్న ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న..స్టూడెంట్స్ కి ఇంకా ఫ్యాకల్టీ చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి నాన్న? నా ఫోటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు.ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.ఎవరికి చెప్పుకోలేక అలా అని కాలేజీకి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం.ఇదీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తాం అని బెదిరించారు.ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు.ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం ప్రపంచానికి తెలుస్తోంది.అందుకే ఆ పని నేనే చేస్తున్నా.నన్ను క్షమించండి నాన్నా..నీకు నేను కాలేకపోయినందుకు ’ అంటూ రూప శ్రీ లేఖలో పేర్కొన్నారు.పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story