- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం: భర్తను కిరాతకంగా కొట్టి చంపిన భార్య.. కారణం ఏంటంటే?
by Disha Web Desk 18 |
X
దిశ,వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య కట్టేసి కిరాతకంగా కొట్టి చంపింది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న రోహిణి అనే మహిళ భర్తతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి ఇవాళ ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో రోహిణి భర్తను కట్టేసి తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్ర గాయాలు పాలైన భర్త గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story