అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు యువకుల దుర్మరణం

by Disha Web Desk 23 |
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు యువకుల దుర్మరణం
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. హుస్సేన్ నగర్ శివారులో మొరం తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పి హుస్సేన్ నగర్ వద్ద ఉన్న డీ 29 కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ట్రాక్టర్ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముత్యంపేట గ్రామానికి చెందిన రాజేష్(25) హుస్సేన్ నగర్ కు చెందిన హైమద్(17) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.గ్రామ శివారులోనే ఘటన జరగడం తో విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా ఘటన స్థలానికి చేరుకున్నారు.ఇరు గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed