- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు
దిశ,వెల్దుర్తి : భార్యను కాపురానికి పంపలేదని అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని కలానుశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక ఎస్సై నవత గౌడ్ కథనం మేరకు గ్రామానికి చెందిన సూది కంసమ్మ (50)కు ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరి వివాహం జరిగింది. చిన్న కూతురు శోభను పది సంవత్సరాల క్రితం మెదక్ మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన దశరథంకు ఇచ్చి వివాహం జరిపించారు. దాంతో కొద్దిరోజుల నుండి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం రాత్రి దశరథం శెట్టిపల్లి గ్రామానికి వచ్చి తన సంసారంలో గొడవలు చేస్తున్నావని, తన భార్యను కాపురానికి పంపడం లేదని కంసమ్మతో గొడవ పడ్డాడు. అనంతరం మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కంసమ్మ రక్తపు మడుగులో గాయాలతో మృతి చెంది ఉంది. మృతురాలు చెల్లి బాలమణి సొంత అల్లుడే తన అక్కను చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.