భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

by Disha Web Desk 15 |
భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు
X

దిశ,వెల్దుర్తి : భార్యను కాపురానికి పంపలేదని అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని కలానుశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక ఎస్సై నవత గౌడ్ కథనం మేరకు గ్రామానికి చెందిన సూది కంసమ్మ (50)కు ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరి వివాహం జరిగింది. చిన్న కూతురు శోభను పది సంవత్సరాల క్రితం మెదక్ మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన దశరథంకు ఇచ్చి వివాహం జరిపించారు. దాంతో కొద్దిరోజుల నుండి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం రాత్రి దశరథం శెట్టిపల్లి గ్రామానికి వచ్చి తన సంసారంలో గొడవలు చేస్తున్నావని, తన భార్యను కాపురానికి పంపడం లేదని కంసమ్మతో గొడవ పడ్డాడు. అనంతరం మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కంసమ్మ రక్తపు మడుగులో గాయాలతో మృతి చెంది ఉంది. మృతురాలు చెల్లి బాలమణి సొంత అల్లుడే తన అక్కను చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed