అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే..?

by Disha Web Desk 4 |
అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా మునగాలలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. గేదెలు ఒక్క సారిగా అడ్డురావడంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంలోని అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed