వరికోత యంత్రంపై నుండి పడి డ్రైవర్ మృతి

by Disha Web Desk 15 |
వరికోత యంత్రంపై నుండి పడి డ్రైవర్ మృతి
X

దిశ, పాపన్నపేట : ఆగి ఉన్న వరికోత యంత్రంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధారిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం ప్రీత్ కోట్ జిల్లా గుగియాన్ గ్రామానికి చెందిన సుర్జిత్ సింగ్ (49) ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చాడు. గత మూడు నెలల నుండి నిజామాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి వద్ద వరికోత యంత్రం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వరి కోతలు ప్రారంభం కావడంతో మండలంలోని

గాంధారిపల్లికి యంత్రాన్ని తీసుకొని వచ్చాడు. గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పంటను కోశాడు. రాత్రి సమయంలో భోజనం చేసేందుకు యంత్రాన్ని ఖాళీ స్థలంలో నిలిపాడు. వరికోత యంత్రం పైన కూర్చొని భోజనం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వెంటనే గమనించిన యంత్రం సహాయకుడు సజన్ స్థానికులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సహాయకుడు సజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

Next Story

Most Viewed