టీ20 వరల్డ్ కప్ కోసం జట్లను ప్రకటించిన నేపాల్, ఒమన్

by Dishanational6 |
టీ20 వరల్డ్ కప్ కోసం జట్లను ప్రకటించిన నేపాల్, ఒమన్
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ కప్ కోసం నేపాల్, ఒమన్ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది. ఈ మెగా టోర్నీలో నేపాల్ జట్టుకు రోహిత్ పాడెల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అందరూ ఊహించిన జట్టునే నేపాల్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపికచేసింది.

కాగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్‌ అర్హత సాధించడం ఇది రెండో సారి. అంతకుముందు 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో నేపాల్‌ తొలిసారి ఆడింది. ఇక నేపాల్ జట్టులో సోంపాల్ కమీ, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.

15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జీషన్ మక్సూద్‌పై వేటు పడింది. ఆల్ రౌండర్ అకిబ్‌ ఇలియాస్‌ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇలియస్‌ ఒమన్‌ క్రికెట్‌ జట్టులో కీలక ఆటగాడు. బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్‌లకు చోటు దక్కింది. మరో సీనియర్‌ ఆటగాడు జతీందర్ సింగ్‌కు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాకే పరిమితం అయ్యాడు.

ఇక ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది.

నేపాల్‌ జట్టు

రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.

ఒమన్ జట్టు

అకిబ్ ఇలియాస్ (కెప్టెన్‌), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్‌ కీపర్‌), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్‌ కీపర్‌), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.

రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా

Next Story