బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి

by Disha Web Desk 23 |
బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు కి చెందిన బత్తుల వినోద్ పై మైలారం గేటు వద్ద వెనుక నుండి పల్సర్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వెళ్తున్న వినోద్ పై కత్తితో దాడి చేశారు. సంఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుందని బాధితుడు మీడియాకు తెలిపారు. తను తెలిసిన సమాచారం మేరకు అచ్చంపేటకు కిరాణా సామాను విషయం వచ్చి చీకటి పడుతున్న సమయంలో ఇంటికి వెళ్తుండు. మార్గమధ్యలో సీతారాం దర్గా వద్ద బైక్ కు అతి సమీపంగా ఓవర్ టేక్ చేసినప్పుడు... ఇప్పుడే కాస్త నాకు ఏదో జరుగుతుందని అనుమానం పడ్డాడు. బల్మూరు వైపు వెళుతున్న వాహనాలను ఆసరాగా చేసుకుని వెళ్తున్న క్రమంలో మరోసారి మైలారం గేటు వద్దకు చేరుకోగానే అతివేగంగా పల్సర్ బైక్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి కత్తితో వీపు పై, తొడకు రెండు చోట్ల దాడి చేశారని, ఆ కత్తి తొడ భాగంలో దూసుకుపోయిందన్నారు. ఈ క్రమంలో వారు వెంటనే అక్కడి నుండి పారిపోయారని తదుపరి స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారి సహకారంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నానని బాధితుడు వాపోయాడు.

ప్రేమ వ్యవహారమే కారణమా..?

గాయపడిన బత్తుల వినోద్ అచ్చంపేట ప్రాంతంలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారని, వారిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రుల నిరాకరించినట్లు బంధువుల ద్వారా తెలిసింది. అయితే వినోద్ పై దాడి జరగడానికి ప్రేమ వ్యవహారమే అయి ఉంటుందని, వీరిద్దరి ప్రేమ లో మరో వ్యక్తి ప్రమేయం గాని, అమ్మాయి తల్లిదండ్రుల పై అనుమానాలు ఉన్నాయని బాధితుడి మామ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వినోద్ పై రెండు సార్లు ఎటాక్ జరిగిన విషయంపై బల్మూరు పోలీసులకు చెప్పిన అంతగా పట్టించుకోలేదని బాధితుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బల్మూరు ఎస్సై బాలరాజును ఫోన్ ద్వారా దిశ వివరణ కోరగా.. గతంలో వంగూరు మండల పరిధిలో వినోద్ పై దాడి జరిగిన, మరోసారి దాడికి ప్రయత్నం జరిగిన ఓరల్ గా చెప్పారు గానీ రాతపూర్వకంగా ఇలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్సై తెలిపారు. ఈ రాత్రి అతనిపై దాడి జరిగిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చారని ముందుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని, అక్కడికి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తామని సూచించామన్నారు.


Next Story

Most Viewed