- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి చేసుకోలేదని అంతం చేశాడు.. యువతి దారుణ హత్య
దిశ, రాజేంద్రనగర్: గతంలో పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించాడు. మైనర్ అయిన యువతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కక్ష కట్టిన యువకుడు ఆమెను అతి దారుణంగా బండ రాయితో మోది హత్య చేశాడు. స్థానికంగా కీర కలకలం సృష్టించిన ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో అర్ధ రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ యువతి తలపై బండరాయితో మోది హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, జాగిలాలను రప్పించి పరిశీలించారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించారు. స్థానికులతో పాటు యువతీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
గతంలో వేధింపులు
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతురాలిని హసన్ నగర్ ప్రాంతానికి చెందిన సమీరా ఖాన్ గా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన మోహిన్ హైమద్ ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లి చేసుకుంటానని అతడు యువతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా నిరాకరించారు. దీంతో కక్షగట్టిన హైమద్ యువతిని తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ తెలియజేశారు. అతి త్వరలో నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.