- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉపాధ్యాయుడి దారుణ హత్య
దిశ, చిన్నశంకరంపేట : 25 రోజుల క్రితం అదృశ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి అదృశ్యం కేసును చేగుంట పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మోత్కూరి నాగరాజు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన గత మార్చి 28వ తేదీ నుండి అదృశ్యం కాగా అతని కుమారుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కథనం
ప్రకారం చేగుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అదే భవనంలో నివాసం ఉంటున్న వంగ సత్యనారాయణ భార్య వంగ స్వాతితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మార్చి 28వ తేదీన అతని బావమరిది మల్లేష్, మల్లేశ్ స్నేహితులైన సునీల్, మరో నిందితునితో కలిసి నాగరాజును చేగుంటలోని అతని నివాసంలోనే కొట్టి చంపి మరుసటి రోజు మృతదేహాన్ని ఒక అద్దె కారులో తీసుకొని హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువులో పడేశారు. ఈ నేరానికి పాల్పడిన సత్యనారాయణ, మల్లేష్, సునీల్ లను రిమాండ్ కు తరలించగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఈ హత్య జరిగిందని సీఐ తెలిపారు.