ఆటో అద్దెల వ్యాపారి హత్య

by Disha Web Desk 15 |
ఆటో అద్దెల వ్యాపారి హత్య
X

దిశ, జహీరాబాద్ : హైదరాబాద్ జగద్గిరిగుట్ట కుద్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోహిర్ మండల కేంద్రంలో హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి షేక్ అన్వర్ (30)గా గుర్తించారు. హతుడు జగద్గిరి గుట్ట ప్రాంతంలో ఆటోలు అద్దెకిచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఆటో నడుపుకుని జీవనోపాధి పొందుతున్న కోహీర్ మండలం రాజనల్లికి చెందిన ముస్తకిన్, గురజవాడకు చెందిన ఖైఫ్ లతో స్నేహం ఏర్పడింది. వీరి మధ్య ఏర్పడిన స్నేహంతో ఆర్థిక లావాదేవీలు జరిగాయి.

నిందితులిద్దరూ జగద్గిరి గుట్ట ప్రాంతంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. హతుడు ఆటోలను అద్దెకిచ్చేవాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా హతుడు కోహీర్ కు రావడంతో తనితో పాటు నిందితులు కోహిర్ లోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో మద్యం సేవించారు. అనంతరం డబ్బులు విషయమై మాటా మాట పెరగడంతో గొడవ జరిగింది. దీంతో నిందితులిద్దరూ ఆయనపై దాడి చేసి హతమార్చినట్లు సీఐ రవి చెప్పారు. హతుని మేనమామ రషీద్ ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణయ్య గౌడ్ కేసు నమోదు చేసుకోగా విచారణ కొనసాగుతుందని సీఐ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.



Next Story

Most Viewed