గంజాయి నిల్వ ఉంచిన వ్యక్తుల అరెస్ట్​

by Disha Web Desk 15 |
గంజాయి నిల్వ ఉంచిన వ్యక్తుల అరెస్ట్​
X

దిశ, గోదావరిఖని : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో గల ఒక ఇంట్లో గంజాయి ఉన్నదనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవి ప్రసాద్ సిబ్బందితో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. దాంతో 750 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు బీరవేని అబిలాష్, గండ్రేటి కార్తీక్ అని తెలిసింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని గంజాయి అమ్ముతున్నామని నిందితులు తెలిపారు. ఇంట్లో లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.



Next Story

Most Viewed