హనుమాన్ జయంతి వేళ కొండగట్టులో ఘోర ప్రమాదం

by Disha Web Desk 18 |
హనుమాన్ జయంతి వేళ కొండగట్టులో ఘోర ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి వేళ కొండగట్టులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అతనిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం మృతుడు వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.



Next Story

Most Viewed