చికెన్ సెంటర్ యజమాని హత్య కేసులో పురోగతి

by Disha Web Desk 15 |
చికెన్ సెంటర్ యజమాని హత్య కేసులో పురోగతి
X

దిశ, జగదేవ్ పూర్ : జగదేవ్ పూర్ లో సోమవారం కలకలం రేపిన రాంరెడ్డి చికెన్ షాపు యజమాని బుచ్చిరెడ్డి మహిపాల్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సంబధిత చికెన్ షాపులో పని చేస్తున్న బీహార్ కు చెందిన కురాబల్, రూబల్ అనే ఇరువురు నిందితులు డబ్బుల కోసం పథకం ప్రకారం మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్లూస్ టీం ఆధారాలు కూడా సేకరించారు. కాగా విశాఖపట్టణంలో రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు హంతకులను అప్పగించినట్లు తెలిసింది.



Next Story

Most Viewed