- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : మీడియా సంస్థల్లో నిత్యం బిజీబిజీగా గడిపే జర్నలిస్టుల ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ గురువారం జరిగింది. నంది టైర్స్ & ట్యూబ్స్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించిన ఈ టోర్నిలో 16 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ప్రీమియర్ లీగ్ 20వ రోజులు పాటు కొనసాగింది.
నిన్న ఫైనల్ మ్యాచ్ 10TV, TV-9 మధ్య జరగగా.. 31 పరుగుల తేడాతో టీవీ-9 ఘన విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకున్న జట్టుకు స్పాన్సర్స్ నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ప్రతినిధులు, MLRIT విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, సెక్రెటరీ మర్రి రాజశేఖర్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెలుపొందిన ఆటగాళ్లకు ట్రోఫీ అందజేశారు. ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నమస్తే తెలంగాణ ఆటగాడు షాణ్వాజ్ నిలవగా, ఆయనకు ఏవేలోట్ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ను ఆ సంస్థ ప్రతినిధులు బహుకరించారు. కాగా, 7H మీడియా ప్రీమియర్ లీగ్కు MLRIT విద్యాసంస్థ అతిథ్యం ఇచ్చింది.