ఏడాది క్రితం గొడవ.. మనసులో పెట్టుకొని ఇనుప రాడ్ తో దాడి!

by Disha Web Desk 5 |
ఏడాది క్రితం గొడవ.. మనసులో పెట్టుకొని ఇనుప రాడ్ తో దాడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్కింగ్ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవను మనసులో పెట్టుకొని హోటల్ యాజమానిపై ఇప్పుడు దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్, గచ్చిబౌలి అంజయ్యనగర్ లో జరిగింది. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హోటల్లోకి ప్రవేశించిన దుండగుడు.. హోటల్ యజమానిపై అందరూ చూస్తుండగానే ఇనుపరాడ్ తో దాడి చేశారు. హోటల్ సెక్యూరిటీ వచ్చి అడ్డుకునే లోపే రాడ్ తో తలపై బలంగా మోదాడు. దీంతో హోటల్ యజమానికి బలమైన గాయాలు కావడంతో.. దాదాపు ఐదు గంటల పాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ మరణించాడు. కాగా చెల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడు కేశవ్ వినయ్ తో కలిసి అంజయ్య నగర్ల లో డెలాయిట్ ఇన్ హోటల్ నడుపుతున్నారు. హోటల్ వెనుక స్టోర్ కోసం ఓ రూం అద్దెకు తీసుకున్నారు.

ఏడాది క్రితం ఆ స్టోర్ రూం ఎదుట ఆటో పార్క్ చేసి సామాన్లు దింపుంతుండగా పక్కింట్లో ఉండే నరేందర్ అనే వ్యక్తి ఆటో పార్కింగ్ వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని శ్రీనివాస్ తో వాదనకు దిగాడు. మాట మాట పెరిగి ఇరువురి మధ్య గొడవ జరగడంతో చుట్టుప్రక్కల వాళ్లు వచ్చి నరేందర్ ను వారించి గొడవ సద్దుమణిగేలా చేశారు. దీంతో తన పరువు పోయిందని భావించిన నరేందర్ హోటల్ యజమాని శ్రీనివాస్ పై కక్ష పెంచుకొని శ్రీనివాస్ ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సెక్యూరిటీ లేని సమయంలో శ్రీనివాస్ హోటల్ లో సోఫాపై కూర్చొని ఉండగా.. ఇనుప రాడ్ తో హోటల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాస్ ను కేర్ హాస్పిటల్ కి తరలించగా.. ఐదు గంటల పాటు మృత్యువుతో పొరాడి చనిపోయాడు.

Next Story

Most Viewed