- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చైనాను ఎదుర్కోవడంలో భారత్ కీలక పాత్ర
వాషింగ్టన్ డీసీ: చైనాను ఎదుర్కోవడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్లో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి కానుందని అమెరికా నేవీ చీఫ్ ఆడమ్ మైక్ గిల్డే అన్నారు. శనివారం వాషింగ్టన్ నిర్వహించిన సెమినార్లో గిల్డే హాజరై ప్రసంగించారు. భారత్ వల్ల చైనా తూర్పు వైపు ఫోకస్ చెయ్యలేదన్నారు. చైనా కేవలం దక్షిణ చైనా సముద్రం, తైవాన్ సంధిపై మరీ ఎక్కువ ఫోకస్ చెయ్యకుండా ఉండేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్లో భారత్ తమకు కీలక భాగస్వామిగా మారనుందని, అందుకే భారత్లో ఎక్కువ రోజులు ఉన్నానని గిల్డే పేర్కొన్నారు. అమెరికాకు హిందూ మహాసముద్రం కీలకంగా మారనుందన్నారు.
భారత్-చైనాకు సరిహద్దు వివాదం ఉందని, రెండు వైపులా దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్నారన్నారు. కాగా, అమెరికా-భారత్ బలగాలు అక్టోబరులో ఉత్తరాఖండ్ వేదికగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయని గిల్డే పేర్కొన్నారు. అయితే ఈ 'యుద్ధ అభ్యాస్' విన్యాసాలు సాధారణంగా చైనా సరిహద్దుకు 300 కి.మీ. దూరంలో జరిగేవి. కానీ ఈ సారి 100 కి.మీ దూరంలోనే నిర్వహించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారత్ చైనాకు గట్టి వార్నింగ్ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నావాషింగ్టన్ డీసీ: చైనాను ఎదుర్కోవడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్లో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి కానుందని అమెరికా నేవీ చీఫ్ ఆడమ్ మైక్ గిల్డే అన్నారు..