భారత్ చంద్రుడిపై అన్వేషణలో ఉంటే.. పాకిస్తాన్ డాలర్ల కోసం వేడుకుంటుంది: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

by Disha Web Desk 12 |
భారత్ చంద్రుడిపై అన్వేషణలో ఉంటే.. పాకిస్తాన్ డాలర్ల కోసం వేడుకుంటుంది: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత దేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈరోజు భారత్ చంద్రుడిపైకి చేరుకుందని, జీ20 సమావేశం భారత్‌లో జరుగుతోంది. కానీ మా పాకిస్తాన్ మాత్రం డాలర్ల కోసం భిక్షాటన చేస్తూ పాకిస్తాన్ బీజింగ్, అరబ్ రాజధానులకు వెళ్లాల్సి వస్తోందని నవాజ్ షరీఫ్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ గందరగోళానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, మాజీ స్పై మాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆరోపించారు. అలాగే పాకిస్తాన్ అప్పులు తీర్చలేని స్థితిలో ఉండటం విచారకరమని ఆయన అన్నారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story

Most Viewed