- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : సమాజంలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు ఏదో రకంగా తమ కోరికలు తీర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. వారికి ఏదో రకంగా ఆశ చూపించి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరిని లోబర్చుకుంటుండగా, మరికొందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఏకాంతంగా ఉన్న టైంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 21 ఏళ్ల ఓ యువతికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది.
నవంబర్ 18న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఆ యువతి పనికోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 5న అడ్డా కూలీల అడ్డా వద్ద కనిపించిన ఆమెను ఇద్దరు వ్యక్తులు ఆపారు. రాజేందర్ రెడ్డి అలియాస్ రాజు (35), ఆంజనేయులు (27) వీరిద్దరూ మహబూబ్నగర్ పట్టణంలోని టీడీ గుట్ట సమీపంలోని లేబర్ అడ్డా వద్ద నిత్యం రోజువారీగా పెయింటింగ్ పనులు చేస్తున్నారు. దీంతో, నీకు మంచి వేతనం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. పని మాట్లాడుతామని ఆమెను బైక్ పై కూర్చోబెట్టుకుని ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక మద్యం మత్తులో ఇద్దరూ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె నగ్నంగా ఉన్న సమయంలో సెల్ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని అడ్డం పెట్టుకుని తమ కోరిక మళ్లీ తీర్చాలని బ్లా్క్ మెయిలింగ్కు పాల్పడ్డారు. బాధితురాలు అందుకు నిరాకరించడంతో తన భర్త నెంబర్ సంపాదించి రేప్ జరిగిన సమయంలోని ఫోటోలు, వీడియోలు పంపించారు. ఆమె పెళ్లి చెడగొట్టే ఉద్దేశ్యంలో భాగానే ఈ విధంగా చేసినట్టు తెలుస్తోంది. చివరకు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులిద్దరినీ టీడీ గుట్ట ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.