- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్ డెస్క్:బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కీలక ప్రకటనలు చేసింది. డిజిటల్ లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలను పొందేందుకు వెంటనే పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ఒకవేళ పాన్-ఆధార్ లింక్ చేసుకోకపొతే పాన్ కార్డు ఎలాంటి లావాదేవీలకు పని చేయదని, ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పాన్-ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం 2022 మార్చి 31 వరకు పొడిగించింది.
సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్దారుల డిజిటల్ లావాదేవీలకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదని రూపే డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ లావాదేవీలపై 2020 జనవరి 1 నుంచి ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు SBI తెలిపింది.జన్ధన్ ఖాతాదారుల నుంచి ఎస్బీఐ రూ.254 కోట్లు వసూలు చేసిందని అందులో రూ.90 కోట్లు మాత్రమే వినియోగదారులకు రిఫండ్ చేసినట్లు వచ్చిన వార్తలపై ఎస్బీఐ స్పందించింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్ 14 వరకు వసూలు చేసిన మొత్తాలను రిఫండ్ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.
పాన్-ఆధార్ ఇంకా లింక్ చేయని వారు (incometax.gov.in) వెబ్సైట్ను విజిట్ చేయండి