- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : త్వరలోనే భారత్లో తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పేర్కొంది. అప్పటి దాకా ఫిర్యాదులను ఇతర అధికారులు పరిష్కరిస్తారని ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది. ‘నూతన ఐటీ నిబంధనల ప్రకారం తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఇది వరకే నియమించాం.
దాన్ని లాంఛన ప్రాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఆ అధికారి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ అధికారి స్థానంలో మరొకరిని నియమించే విషయంలో ఫైనల్ స్టేజీలో ఉన్నాం’అని తెలిపింది. తమ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిజిష్టర్ అయినందున ఈ పిటిషన్ను కొనసాగించదగినది కాదని హైకోర్టులో ట్విట్టర్ వాదనలు వినిపించింది.
Next Story