- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు సంబంధించి సంగారెడ్డి కాల్వపైన గుమ్మడిదల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి. ఈ మేరకు శనివారం సీఎంను ప్రగతి భవన్లో కలిసి గుమ్మడిదల ఎత్తిపోతలతో కలగే ప్రయోజనాలను వివరించి, వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడిదల ఎత్తి పోతల పథకం ద్వారా దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 8 మండలాలు(మనోహరబాద్, ములుగు, మేడ్చల్, శివమ్పేట, హత్నూరా, జిన్నారం, అమీన్ పూర్, గుమ్మడిదల), 50 గ్రామాలకు తాగునీటిని కల్పించవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు.
Next Story