సీఎంకు కరోనా.. టెన్షన్‌లో అధికారులు

by  |
సీఎంకు కరోనా.. టెన్షన్‌లో అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబెట్రీలు కరోనా బారినపడ్డారు. తాజాగా త్రిపుర సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు. తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.



Next Story

Most Viewed