వేద మంత్రాల సాక్షిగా శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి.. షాక్ అవుతున్న నెటిజెన్స్

by Disha Web Desk 10 |
వేద మంత్రాల సాక్షిగా శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి.. షాక్ అవుతున్న నెటిజెన్స్
X

దిశ, ఫీచర్స్: కొందరికి చిన్నప్పటి నుంచి భగవంతుని పట్ల అమితమైన భక్తి ఉంటుంది. వారు తమను తాము దేవునికి అంకితం చేసుకుంటారు. ఇంక ఎప్పుడూ కూడా భగవంతుని సేవలోనే వారి జీవితాలను గడుపుతారు. గ్రామాల్లో దేవదాసీలు కనిపిస్తారు. దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వారు ఇతరుల గురించి పట్టించుకోకుండా జీవితాంతం దేవుని సేవ చేస్తారు. ముఖ్యంగా మార్వాడీ, గుజరాత్ రాష్ట్రాల్లో కృష్ణుడికి తమ జీవితాన్ని అంకితం చేసిన అమ్మాయిల ఘటనలు ఎన్నో చూశాం.

తాజాగా అదే విధంగా, మరొక యువతి శ్రీ కృష్ణుడిని వివాహం చేసుకుంది. వరుడు యువతి వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి ఆచారాలు ఉంటాయో అలాగే జరిగింది ఈ పెళ్లి. ఆలయంలో శ్రీకృష్ణుడు పెళ్లికొడుకుగా ఉన్న చిత్రం ఉంది. వేద మంత్రాల సాక్షిగా శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడింది. ఈ సంఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన శివాని పరిహారకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజించేది. అందుకే కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. కృషుడిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని చెప్పింది. ఇటీవలే శ్రీకృష్ణుడి విగ్రహంతో వివాహ వేడుక కూడా బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం బాజా బజంత్రిల మధ్య అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు.



Next Story

Most Viewed