మొక్కల సంరక్షణ అందరి బాధ్యత.. ఏపీఓ వసుమతి సూచన

by  |
APD Vasumathi
X

దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో ఉన్న నర్సరీల పెంపకంపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీడీ వసుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వసుమతి మాట్లాడుతూ… మొక్కల సంరక్షణ, వాటి ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. నర్సరీలో బ్యాక్ ఫీల్డింగ్, సీడ్ డిబ్లింగ్‌లపై అవగాహన కల్పించారు. మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, ఏపీఓ వెంకట నారాయణ, స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed