- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆయా గ్రామాల పొలిమేరలో ఏర్పాటైన వ్యాపార దుకాణాలను ( డబ్బాలు) లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతూ దోపిడీలకు పాల్పడుతున్నారు. 2 రోజుల క్రితం తుంగతుర్తి పట్టణ శివారులో వీరబోయిన కనకతార దుకాణంలో దొంగలు పడి దాదాపు 40 వేల విలువచేసే సామాగ్రి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే శుక్రవారం మండలంలోని కరివిరాల, అన్నారం క్రాస్ రోడ్డు, తుంగతుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో పలువురు ఏర్పాటు చేసుకున్న వ్యాపార దుకాణాలలో( డబ్బాలు) దొంగలు దోపిడీకి పాల్పడ్డారు.
తుంగతుర్తి పట్టణ శివారు మద్దిరాల జాతీయ రహదారిపై ఎల్లబోయిన విష్ణు కిరాణా డబ్బా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న మద్యం బాటిల్స్, పదివేల నగదుని ఎత్తుకెళ్లారు. అనంతరం అన్నారం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న దొంగలు అక్కడ ఉన్న వెలుగు సతీష్ కూల్ డ్రింక్ దుకాణ డబ్బా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండు వేల నగదు, 10 లీటర్ల పెట్రోలు దొంగలించారు. అంతే కాకుండా సిగరెట్ ప్యాకెట్లను కూడా వదలకుండా రెండు వేల రూపాయల విలువ చేసే ప్యాకెట్లు దొంగిలించారు.
అనంతరం దాని ఎదురుగా నే ఉన్న భువనగిరి సురేందర్ ఇంటి తాళాలు పగులగొట్టి గ్యాస్ సిలిండర్ ను దొంగిలించారు. అలాగే భువనగిరి రాజు ఇంటి తాళాలు పగులగొట్టి పదిహేను వందల రూపాయల నగదు, గ్యాస్ సిలిండర్, మద్యం సీసాలను పెద్ద ఎత్తున దొంగిలించారు. కరివిరాల గ్రామ శివారులో ఏర్పాటైన వెలుగు సైదులు కిరాణా డబ్బా తాళాలను పగులగొట్టి అందులో ఉన్న పెద్ద మొత్తంలో వివిధ రకాల కూరగాయలను, మద్యం సీసాలు, ఐదు వందల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ట్రైనీ ఎస్ఐ భావన, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య, తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.