చావులోనూ వీడని బంధం.. భర్త మృతిచెందిన గంటకే భార్య మృతి

by  |
చావులోనూ వీడని బంధం.. భర్త మృతిచెందిన గంటకే భార్య మృతి
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త కరోనాతో మృతి చెందితే.. అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె గుండె ఆగింది. భర్త అంతిమ క్రియలకు తీసుకెళ్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. గోరెమియా (58) ఆర్మూర్ పట్టణం మజ్లిస్ పార్టీ ఇంచార్జి గా వ్యవహారిస్తున్నారు. అతనికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో గోరెమియా హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం అర్ముర్ లో ఆయన అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా భార్య మృతి చెందింది. గంట వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చావులోనూ వీడని బంధం వీరిది అంటూ గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు

Next Story