బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన నేతలు

by Web Desk |
బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన నేతలు
X

దిశ, దుబ్బాక : దుబ్బాకలో బీజేపీ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్‌గా పనిచేస్తున్న దొమ్మాట భూపాల్ ఈ రోజు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు గల్ఫ్ బాధితుల ఫోరం రాష్ట్ర సభ్యులు నక్క వెంకటేష్, గల్ఫ్ బాధితుల పోరం జిల్లా అధ్యక్షుడు, బీజేపీ 40 వ వార్డు ఇంచార్జి వేములవాడ ఎల్లం కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల దుబ్బాక పట్టణంలోని 19వ వార్డు కౌన్సిలర్ ఎంగారి స్వప్న, పట్టణ అధ్యక్షుడు ఎంగారి రాజిరెడ్డిలు బీజేపీ పార్టీని వీడి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఈ రోజు మరో ముఖ్యమైన నాయకుడు దొమ్మాట భూపాల్ టీఆర్ఎస్‌లో చేరడంతో దుబ్బాకలో బీజేపీకి గట్టి షాక్ తగిలిందని పలువురు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో తమవంతు సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Next Story