అల్లాదుర్గానికి చెందిన యువకుడి అదృశ్యం.. అతడిని కలిసిన తర్వాత..

by Web Desk |
అల్లాదుర్గానికి చెందిన యువకుడి అదృశ్యం.. అతడిని కలిసిన తర్వాత..
X

దిశ, కంది : సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గం ఐ.బీ తండాకు చెందిన వడ్త్య శ్రీనివాస్ (20) సంగారెడ్డిలోని గవర్నమెంట్ ఐటీఐలో చదువుతున్నాడు. గత నెల 28న ఉదయం 11 గంటలకు తన స్వగ్రామం నుండి కాలేజీకి వెళుతున్నా అని ఇంట్లో చెప్పాడు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంగారెడ్డి కొత్త బస్టాండ్‌లో తన స్నేహితుడైన వినోద్ కుమార్‌ను కలిసి మాట్లాడాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో తండ్రి వడ్త్య గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ఆచూకీ తెలిసినవారు 9490617010 లేదా 7901148703, 08455-276333 ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ సూచించారు.

Next Story

Most Viewed