ఆ పని చేస్తుండగా కాటేసిన పాము.. మహిళ చేసిన పనికి అంతా షాక్

by Disha Web Desk 4 |
ఆ పని చేస్తుండగా కాటేసిన పాము.. మహిళ చేసిన పనికి అంతా షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పామును చూస్తే చాలా మంది హడలిపోతారు. అది కాటు వేయగానే ఏం జరుగుతుందో అని భయపడి ప్రాణాలు వదిలిన వాళ్లు ఉన్నారు. అయితే ములుగు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిందని దాన్ని చంపి ఏకంగా మహిళ ఆస్పత్రికి తీసుకెళ్లి్ంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరు పాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. అయితే పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని భావించి శాంతమ్మ పామును చంపి ఓ ఖాళీ వాటర్ బాటిల్‌లో వేసి ఆస్పత్రకి తీసుకెళ్లింది. పామును ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు షాక్ కు గురయ్యారు. అనంతరం పామును విషపూరితమైనదిగా గుర్తించి శాంతమ్మకు చికిత్స అందించారు.


Next Story