ఎక్కడికి పంపాలో అధికారంలోకి వచ్చాక ఆలోచిస్తాం!.. అసదుద్దీన్ వ్యాఖ్యలకు రాజసింగ్ కౌంటర్

by Disha Web Desk 5 |
ఎక్కడికి పంపాలో అధికారంలోకి వచ్చాక ఆలోచిస్తాం!.. అసదుద్దీన్ వ్యాఖ్యలకు రాజసింగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమని చంపాలని చూస్తున్నారు అన్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఓవైసీ తన అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి చేస్తున్న ప్రచారంలో డెవలెప్ మెంట్ గురించి, తమకు ఓట్లు ఎందుకు వేయాలో అనే దాని గురించి మాట్లాడకుండా.. వేరే సబ్జెట్ల గురించి మాట్లాడి మరోసారి ముస్లింలను మోసం చేయడానికి అన్నదమ్ములు కుట్రలు చేస్తున్నారన్నారు.

మిమ్మల్ని బుల్లెట్ ఉపయోగించో లేకపోతే జైళ్లో వేసి చంపాలని అనుకోవట్లేదని, వచ్చే ఎన్నికల సమయంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు మా కాళ్లు పట్టుకుంటారని, ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని అన్నారు.మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకొని మీ బిజినెస్ లు చేసుకుంటారని, గవర్నమెంట్ భూములు కబ్జా చేసి అమ్మేస్తారని, ముస్లింల పేరుతో ఫండ్ లు తీసుకొని మోసం చేస్తారని అది మీ హిస్టరీ అని ఆరోపించారు.

గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుంటే ఆయన తన్ని తరిమేశారని, అలాగే కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన కాళ్లు పట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకు చేరారని ఎద్దేవా చేశారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వస్తుందని, అప్పుడు పైకి పంపాలో? ఎక్కడికి పంపాలో ఆలోచిస్తామని, పార్టీ ప్రచారంలో డెవలెప్ మెంట్ గురించి మాట్లాడాలి అంటేకానీ ఫాల్తు నకరాలు పడొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Next Story