- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దాహం.. దాహం.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన
దిశ, మల్హర్: మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు దొరకక ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మల్హర్ మండలం తాడిచెర్ల ఎనిమిదో వార్డులో సోమవారం జరిగింది. గ్రామంలోని రేగడి పల్లి వార్డులో గత ఐదు రోజులుగా తాగునీరు కొరతతో అల్లాడుతున్న పట్టించుకునే లేరని మహిళలు రోడ్డుపై నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు. స్నానం చేయడానికి నీరు దొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న రెండు బోర్లు చెడిపోవడంతో చుక్కనీరు దొరకక దాహం తీర్చుకోవడానికి అతలాకుతులమవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడంతో దాహం తీసుకునేందుకు పొలాల్లోని బోరు మోటార్ల వద్ద పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన చెబుతున్నారు. మంచినీరు సరఫరా చేయాలని అధికారులను వేడుకున్న పట్టించుకున్న దాఖలాలు కనిపిస్తలేవని, ఐదు రోజులుగా స్నానం చేయలేక కంపు కొడుతున్నామని ఆవేదన చెందారు. తాగునీరు అందక వార్డు ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరా అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.