ఆల్ ఇండియా రేజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

by Web Desk |
ఆల్ ఇండియా రేజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
X

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా నుండి ఆల్ ఇండియా రేజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శానబోయిన రాజ్ కుమార్ అభినందించారు. డిసెంబర్ 10 వ తేదీ 2021న కాకతీయ యూనివర్సిటీలో జరిగిన అంతర్ యూనివర్సిటీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు దుగ్గొండి మండలం నుండి శివ గణేష్, కార్తీక్, యశ్వంత్, నల్లబెల్లి మండలం నుండి సాయి, ప్రీతం, పర్వతగిరి మండలం నుండి రాజేశ్వరి, రమ్య, మహేష్ లు పాల్గొని బంగారు పతకాలు సాధించి ఆల్ ఇండియా రేజ్లింగ్ క్రీడలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన క్రీడా కారులు మార్చి 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు హర్యానా రాష్టంలో జరుగనున్న అల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్, అసోసియేషన్ కోచ్ లు కందికొండ రాజు, ఇటుకాల దేవేందర్, సిరిపురం మహేష్, వెంకటాపూర్ ఎంపీటీసీ విజయ మోహన్ రావు, కక్కేర్ల ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed